వేదంబులు గననేరని
వేదంబులు గననేరని
యాది పరబ్రహ్మమూర్తి యనఘ!మురారీ!
నా దిక్కుఁ జూచి కావుము
నీ దిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా!
హే కృష్ణా!ముర అనే రాక్షసుడిని చంపిన దుష్టశిక్షకుడివి.ఎలాంటి పాపములు అంటని వాడివి.వేదములు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాయి.ఆది అంతం,చావు పుట్టుకలు లేని పరబ్రహ్మమూర్తివి నీవు.నా దిక్కున చూసి,నన్ను కరుణించుము స్వామీ!నిజంగా నీవే నాకు దిక్కు అని మనసా,వాచా,కర్మణా నమ్మినాను.
Comments
Post a Comment